ఈ ఏడాది దేశంలో జీతాలు సగటున 9.5% పెరిగే అవకాశం

2023లో పెరుగుదల 9.7% కంటే ఇది స్వల్పంగా మార్పు

అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవా సంస్థ ఎయాన్‌ పీఎల్‌సీ సర్వే వెల్లడి

ఇందుకోసం 45 రంగాలకు చెందిన 1,414 కంపెనీల డేటా విశ్లేషణ

రంగాలవారీగా ఆర్థిక సేవల సంస్థలు, ఇంజినీరింగ్‌, వాహన, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో వేతన పెంపు ఉండే ఛాన్స్

రిటైల్‌, టెక్నాలజీ కన్సల్టింగ్‌, సేవల రంగాల్లో తక్కువ వేతన పెంపు ఉండొచ్చని అంచనా

పటిష్ఠ ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో వేతన పెంపు అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ టాప్

ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్‌, ఇండోనేషియా ఉన్నాయని చెప్పిన సర్వే

కరోనా తర్వాత 2022లో దేశంలో అధిక వేతనాల పెంపు వచ్చిందన్న సర్వే