భారత్కు ఈ వారంలో మరో మూడు కరోనా టీకాలు!
ABN , First Publish Date - 2021-08-17T13:57:21+05:30 IST
దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్కు...
న్యూఢిల్లీ: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్కు ఈ వారం మరింత కీలకం కానుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీవో) సబ్జక్ ఎక్స్పర్ట్ కమిటీ వ్యాక్సిన్కు సంబంధించిన మూడు అభ్యర్థనలను సమీక్షించనుంది. వీటిలో జైడస్ కాడిలా, కోవాక్స్, స్పుత్నిక్ లైట్ ఉన్నాయి.
ఒకవేళ ఈ మూడు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తే, భారత ప్రభుత్వం భావిస్తున్న విధంగా ఈ ఏడాది చివరినాటికి దేశంలోని ప్రజలందరికీ టీకాలు వేయాలన్న లక్ష్యం నెరవేరనున్నది. నిపుణుల కమిటీ ముందుగా అహ్మదాబాద్ నుంచి ఉత్పత్తి అవుతున్న జైడస్ కాడిలా వ్యాక్సిన్పై సమీక్షించనుంది. ఈ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్కు సంబంధించిన ట్రయల్స్ డేటాను కంపెనీ ప్రభుత్వానికి అందించింది. ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి లభించినట్లయితే కోవాగ్జిన్ తరువాత ఇది రెండవ స్వదేశీ వ్యాక్సిన్గా నిలవనున్నది.