జడ్పీటీసీ గంగాధర్‌ మృతి

ABN , First Publish Date - 2021-04-17T04:39:41+05:30 IST

జడ్పీటీసీ గంగాధర్‌(46) రక్తపోటుకు గురై గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు.

జడ్పీటీసీ గంగాధర్‌ మృతి

కుటుంబాన్ని పరామర్శించిన నేతలు

లింగాల, ఏప్రిల్‌ 16: జడ్పీటీసీ గంగాధర్‌(46) రక్తపోటుకు గురై గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. బుధవారం గంగాధర్‌ ఇంటి వద్ద నుంచి ఉదయం తన స్వగ్రామం తాతిరెడ్డిపల్లె నుంచి పులివెందులకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా లింగాల వద్ద రక్తపోటు ఎక్కువై ద్విచక్ర వాహనం నుంచి కిందపడ్డాడు. దీంతో అతన్ని కడపలో ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికు తరలించారు.

అక్కడ ఆయన చికిత్స పొందుతూ గురువారం అర్దరాత్రి మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. గంగాధర్‌ కుటుంబాన్ని పులివెందుల నియోజకవర్గ ఇనచార్జి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, లింగాల ఇనచార్జి శివప్రకాష్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి తదితరులు గంగాధర్‌ మృతదేహం వద్ద నివాళులర్పించి సంతాపం తెలియజేశారు. 

Updated Date - 2021-04-17T04:39:41+05:30 IST