FILE PHOTO
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మంగళవారం నాడు జరిగిన 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను ఇవాళ లెక్కిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఆయా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకే ఎంపీటీసీ, మధ్యాహ్నం 12 గంటలకు జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కాగా.. 14 జడ్పీటీసీల్లో 04 ఏకగ్రీవం కాగా.. 10 స్థానాలకు పోలింగ్ జరిగింది. 176 ఎంపీటీసీల్లో 50 ఏకగ్రీవం కాగా.. 03 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ మిగిలిన 123 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 16న జరిగిన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి