19న జడ్పీ సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2021-12-07T06:38:50+05:30 IST

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 19న నిర్వహించనున్నట్లు సీఈవో జాలిరెడ్డి సోమవారం తెలిపారు.

19న జడ్పీ సర్వసభ్య సమావేశం

ఒంగోలు (జడ్పీ), డిసెంబరు 6: జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 19న నిర్వహించనున్నట్లు సీఈవో జాలిరెడ్డి సోమవారం తెలిపారు. స్థాయీసంఘాల ఎన్నికలను కూడా అదే రోజున పూర్తిచేస్తామన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున ఎంపీలు హాజరుకావడానికి వీలుగా ఆదివారం (డిసెంబరు 19) సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. జడ్పీ పాలకవర్గం కొలువుదీరాక ఇదే తొలి సర్వసభ్య సమావేశం కానుంది

Updated Date - 2021-12-07T06:38:50+05:30 IST