జడ్పీ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా !
ABN , First Publish Date - 2022-05-24T03:24:31+05:30 IST
మండలంలోని అన్నారెడ్డిపాళెం జడ్పీ ఉన్నత పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎన్ఆర్ఐ కామిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఇంది
సంగం, మే 23: మండలంలోని అన్నారెడ్డిపాళెం జడ్పీ ఉన్నత పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎన్ఆర్ఐ కామిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఇందిర దంపతులు పేర్కొన్నారు. 30 ఏళ్ల తరువాత స్వగ్రామానికి వచ్చిన ఆయన సోమవారం జడ్పీ పాఠశాల ఉపాఽధ్యాయులు, విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వగ్రామంలో చదువుకునేందుకు తనలాగా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో జడ్పీ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధితోపాటు రూ. 10 లక్షలు డిపాజిట్ చేసి ప్రతి సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తానని ప్రకటించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరెడ్డి, ఎన్ఆర్ఐ దంపతులను శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.