గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-01-20T06:23:07+05:30 IST

గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు.

గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి
జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్రకు వినతిపత్రం ఇస్తున్న జోలాపుట్టు సర్పంచ్‌ నీలకంఠం

జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర



ముంచంగిపుట్టు, జనవరి 19: గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు. బుధవారం మండలంలోని జోలాపుట్టు పంచాయతీలో ఆమె పర్యటించారు. గ్రామాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ సర్పంచ్‌ డి.నీలకంఠం వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆమెకు అందించారు. ఈ పర్యటనలో వైసీపీ నాయకులు సులేమాన్‌, జేవీవీఎన్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-20T06:23:07+05:30 IST