జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిని కలిసిన హఫీజ్పేట కార్పొరేటర్
ABN , First Publish Date - 2020-12-06T04:54:41+05:30 IST
జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిని కలిసిన హఫీజ్పేట కార్పొరేటర్
వికారాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి తన డివిజన్లో చేసిన ప్రచారం వల్లే తన విజ యం సులభమైందని హ ఫీజ్పేట డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన పూజితాజగదీశ్వర్గౌడ్ అన్నారు. శనివారం ఆమె హైదరాబాద్లోని చైర్పర్సన్ సునీతారెడ్డి నివాసానికి వెళ్లి ఆమెను శాలువాతో సన్మానించారు. తన విజయంలో ప్రధాన భూమిక పోషించిన సునీతారెడ్డికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పూజిత తన కృతజ్ఞతలు తెలిపారు.