అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-12-03T04:50:47+05:30 IST

అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
ప్రతాప్‌సింగారంలో పల్లె ప్రకృతివనాన్ని పరిశీలిస్తున్న చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి

జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి

ఘట్‌కేసర్‌ రూరల్‌ : అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు సాగుతుందని జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం ప్రతా్‌పసింగారంలో బుధవారం ఆయన జిల్లా అదనపు కలెక్టర్‌ జాన్‌శాంసన్‌తో కలిసి పర్యటించారు. పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, రైతువేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తుందని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం సూచించిన పనులను వెంటనే పూర్తిచేయాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ వంగూరి శివశంకర్‌, ఎంపీటీసీ మలిపెద్ది వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T04:50:47+05:30 IST