వ్యర్థంపై యుద్ధంలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2020-12-06T04:51:38+05:30 IST

వ్యర్థంపై యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జెడ్పీ సీఈఓ నాగార్జునసాగర్‌ పిలుపునిచ్చారు.

వ్యర్థంపై యుద్ధంలో భాగస్వాములు కావాలి
మాట్లాడుతున్న జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్‌

జెడ్పీ సీఈఓ నాగార్జునసాగర్‌ పిలుపు

మహారాణిపేట, డిసెంబరు 5: వ్యర్థంపై యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జెడ్పీ సీఈఓ నాగార్జునసాగర్‌ పిలుపునిచ్చారు. జెడ్పీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘మనం-మన పరిశుభ్రత’ కార్యక్రమం రెండో దశలో భాగంగా జిల్లాలోని 153 పంచాయతీల్లో ‘ఓడీఎఫ్‌ ప్లస్‌’ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఈనెల 7 నుంచి 21వ తేదీ వరకు పక్షోత్సవాల్లో భాగంగా వర్క్‌షాపులు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వ శాఖల సిబ్బంది. స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారంతో ‘వ్యర్థంతో యుద్ధం’ కార్యక్రమం చేపడుతున్నామని, దాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమారి పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-06T04:51:38+05:30 IST