మా మధ్య విభేదాలు లేవు : సరిత
ABN , First Publish Date - 2020-07-09T11:04:25+05:30 IST
ఎమ్మెల్యేలతో తమకు విభేదాలు లేవని, ఇదంతా మీడియా సృష్టి మాత్రమేనని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుతయ్య స్పష్టం ..
గద్వాల, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేలతో తమకు విభేదాలు లేవని, ఇదంతా మీడియా సృష్టి మాత్రమేనని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుతయ్య స్పష్టం చేశారు. మానవపాడు మండల కేంద్రంలో తడి పొడి చెత్తను వేరు చేసేందుకు నిర్మించిన షెడ్ను మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం ప్రారంభించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ సరిత మరోమారు రిబ్బన్ కట్చేసి షెడ్ను ప్రారంభించారు. ఈ విషయంపై పత్రి కల్లో కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ నేపథ్యంలో జడ్పీ చైర్పర్సన్ సరిత దంపతులు బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని కలిసి మొక్కను అందించారు. అనంతరం అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాంను కలిశారు. శాలువతో సన్మానించి, పుష్పగుచ్ఛాన్ని అందించారు. మీడియాలో వస్తున్న కథనాలను పట్టించుకుంటే ముందుకు సాగలేమని, అందరమూ కలిసి ముందుకు సాగుదామని చెప్పినట్లు సమాచారం. కుటుంబంలో వచ్చే సమ స్యలను కలిసి పరిష్కరిచుకుంటామని డాక్టర్ అబ్రహం అన్నారు. మానవ పాడులో జరిగిన సంఘటన తనకు తెలియదని, గద్వాల నియోజకవర్గం లో ఎవరితో వివాదాలు లేవని బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు.