జిల్లా పరిషత్ల విభజన ఇప్పట్లో లేనట్లే: బొత్స
ABN , First Publish Date - 2022-04-03T21:52:02+05:30 IST
జిల్లా పరిషత్ల విభజన ఇప్పట్లో లేనట్లేనని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: జిల్లా పరిషత్ల విభజన ఇప్పట్లో లేనట్లేనని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జడ్పీల విభజనపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని తెలిపారు. ప్రస్తుతమున్న జిల్లా పరిషత్ల నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పారు. అధ్యయనం తర్వాత జడ్పీల విభజనపై విధివిధానాలు ప్రకటిస్తామని బొత్స స్యతనారాయణ తెలిపారు.
13 జిల్లాల నవ్యాంధ్ర... ఇక 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా మారింది. కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత ప్రభుత్వం తుది నోటిఫికేషన్లు జారీ చేసింది. రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్ వీటిని విడుదల చేశారు. అంతకుముందు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎస్పీలను నియమిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.