వైవీయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2022-08-11T05:35:15+05:30 IST
వైవీయూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం 1వ, 3వ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను బుధవారం రిజిస్ట్రార్ విజయరాఘవప్రసాద్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఎన్.ఈశ్వర్రెడ్డితో కలిసి వీసీ సూర్యకళావతి విడుదల చేశారు.
కడప వైవీయూ, ఆగస్టు 10: వైవీయూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం 1వ, 3వ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను బుధవారం రిజిస్ట్రార్ విజయరాఘవప్రసాద్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఎన్.ఈశ్వర్రెడ్డితో కలిసి వీసీ సూర్యకళావతి విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మేలో జరిగిన మొదటి సెమిస్టర్ పరీక్షలకు 10,564 మంది విద్యార్థులు హాజరుకాగా 4,169 మంది, మూడో సెమిస్టర్ పరీక్షలకు 10,752 మంది హాజరు కాగా 4,596 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. కార్యక్రమంలో సహాయ పరీక్షల నిర్వహణ అధికారులు డాక్టర్లు వరప్రభాకర్, ఆదినారాయణరెడ్డి, సుమిత్ర పాల్గొన్నారు.