వైవీ సుబ్బారెడ్డి పీఏ భూకబ్జా

ABN , First Publish Date - 2022-06-02T23:37:52+05:30 IST

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ మునికృష్ణారెడ్డి భూకబ్జాకు పాల్పడ్డాడు. తిరుపతి పట్టణంలోని యాదవవీధిలో ఏకంగా రోడ్డు స్థలాన్నే

వైవీ సుబ్బారెడ్డి పీఏ భూకబ్జా

తిరుపతి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ మునికృష్ణారెడ్డి భూకబ్జాకు పాల్పడ్డాడు. తిరుపతి పట్టణంలోని యాదవవీధిలో ఏకంగా రోడ్డు స్థలాన్నే మునికృష్ణారెడ్డి ఆక్రమించాడు. అడ్డంగా ఉన్న కరెంట్ స్తంభాన్ని తొలగించాడు. విద్యుత్ పోల్‌ను పగులగొట్టి సర్వీస్ వైర్లను మునికృష్ణారెడ్డి కొయ్యకు కట్టాడు. నిలదీసిన బాధితులపై మునికృష్ణారెడ్డి బెదిరింపులకు దిగాడు. తిరుపతి కార్పొరేషన్, కలెక్టర్‌కు బాధితులు విన్నవించినా ఫలితం లేదు. తమకు దారి, విద్యుత్ పోల్, కాలువ ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. 

Updated Date - 2022-06-02T23:37:52+05:30 IST