ఇంట గెలిచాక రచ్చ గెలవండి దొరా: Sharmila
ABN , First Publish Date - 2022-01-12T18:24:28+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సెటైర్లు విసిరారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సెటైర్లు విసిరారు. ఇంట గెలిచిన తరువాత రచ్చ గెలవండి దొరా అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకు తమిళనాడు ముఖ్యమంత్రితో మాటామంతికి.... కేరళ సీఎంతో మంతనాలు చేయడానికి.. బీహార్ ప్రతిపక్ష నేతను కలసి దోస్తానా చేయడానికి.... దేశ రాజకీయాల మీద చర్చ చేయడానికి సమయం ఉంది.... చనిపోతున్న రైతులను ఆదుకోవాలనే సోయి లేదు... మీ రైతుబంధు వారోత్సవాల సాక్షిగా..బ్యాంకుల ఆగడాలకు రైతులు బలైపోతున్నది... మీకు కనపడుతుందా దొరా? పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకొనే రైతులు మీకు కనపడరు. వడ్డీ వ్యాపారుల చేతుల్లో నష్టపోయిన రైతులు మీకు కనపడరు. రుణాలు చెల్లించలేక ప్రాణాలు తీసుకొనే రైతులు మీకు కనపడరు. ముందు ఇక్కడి రైతుల చావులను ఆపి తరువాత దేశాన్ని ఏలపోండి’’ అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.