కల్లాల్లో రైతులు... క్యాంపుల్లో మంత్రులు: షర్మిల
ABN , First Publish Date - 2021-12-02T22:44:41+05:30 IST
మంత్రులపై వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల ఆసక్తికర
హైదరాబాద్: మంత్రులపై వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల్లో రైతులు... క్యాంపుల్లో మంత్రులు ఉన్నారని షర్మిల పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రిసార్టుల్లో జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. వడ్ల కొనుగోళ్ల జాప్యంతో రైతులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల ప్రాణాలకంటే అధికారమే ముఖ్యమనే విధంగా మంత్రుల తీరు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు.