Nallagonda: 25వ రోజుకు వైఎస్ షర్మిల పాదయాత్ర
ABN , First Publish Date - 2022-03-14T13:38:15+05:30 IST
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది.
నల్గొండ: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు రామన్నపేట మండలం పద్మశాలీ కాలనీ నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. శిపురం, భోగారం క్రాస్, సిరిపురం, వెల్లంకి మీదుగా యాదాద్రి-భువనగిరి జిల్లా సుద్ద బావిగూడెంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం 5 గంటలకు వలిగొండ మండలం గొల్నేపల్లిలో ప్రజలతో షర్మిల మాటముచ్చట నిర్వహించనున్నారు.