మా పార్టీ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు: Gattu

ABN , First Publish Date - 2022-01-19T18:10:14+05:30 IST

తెలంగాణలో వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని వైఎస్సార్‌టీపీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు.

మా పార్టీ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు: Gattu

హైదరాబాద్: తెలంగాణలో వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని వైఎస్సార్‌టీపీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. తమ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. విగ్రహాల ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్సార్ పథకాలతో ఎక్కువ లబ్దిదారులు తెలంగాణలోనే ఉన్నారని తెలిపారు. వైఎస్సార్ మీద అభిమానంతోనే లక్షల విగ్రహాలు పెట్టుకున్నారని చెప్పారు. ఇతర పార్టీకి చెందిన నేతలే వైఎస్సార్ విగ్రహాలు పడగొడుతున్నారని ఆరోపించారు. ప్రజల మధ్య అల్లర్లు పుట్టించేలా కుట్ర చేస్తున్నారన్నారు. ‘‘మాకు ప్రభుత్వం మీదే అనుమానం కలుగుతుంది. వైఎస్సార్ ఇమేజ్ పార్టీకి వస్తుందని జెలసీతో విగ్రహాలు పడగొడుతున్నారు’’ అని గట్ట రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-01-19T18:10:14+05:30 IST