సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో షర్మిల ధర్నా

ABN , First Publish Date - 2022-05-06T18:07:47+05:30 IST

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో రైతులతో కలిసి వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ధర్నాకు దిగారు.

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో షర్మిల ధర్నా

సూర్యాపేట: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో రైతులతో కలిసి  వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ధర్నాకు దిగారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్‌లో వరి ధాన్యం కొనుగోళ్లపై రైతులతో చర్చించారు. దళారుల చేతిలో మోసపోతున్నామని రైతులు.. షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. ఇవ్వాళ మార్కెట్‌లో ఇద్దరికి మాత్రమే రూ.1961 ధర పడిందని, మిగతా 600 మంది రైతులకు రూ.1400కు మించలేదని రైతులు వాపోయారు. 

Read more