ధరణి... ఎవరికి మేలు చేయడానికి?: Sharmila

ABN , First Publish Date - 2021-12-14T19:22:21+05:30 IST

ధరణిలో లోపాల వల్ల రైతుల ప్రాణాలు పోతున్నారని వైఎస్సార్‌ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు.

ధరణి... ఎవరికి మేలు చేయడానికి?: Sharmila

సిద్దిపేట: ధరణిలో లోపాల వల్ల రైతుల ప్రాణాలు పోతున్నారని వైఎస్సార్‌ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. మంగళవారం జిల్లాలో వర్గల్ మండలం దండుపల్లిలో పర్యటించిన షర్మిల ఆత్మహత్య చేసుకున్న రైతు చింతలస్వామి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వైసీపీ అధినేత్రి మాట్లాడుతూ సీఎం నియోజకవర్గంలోనూ భూసమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సమస్య పరిష్కారం కాదు.. భూమి వదులు కోవాల్సిందే అనడంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ధరణి ఎవరికి మేలు చేయడానికి అని ప్రశ్నించారు. ఇంతమంది అధికారులు ఉండి ఏంలాభమని నిలదీశారు. బాధిత రైతు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-14T19:22:21+05:30 IST