TS news: కేసీఆర్‌కు ఇంగిత జ్ఞానం ఉందా: షర్మిల

ABN , First Publish Date - 2022-07-22T19:52:41+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

TS news: కేసీఆర్‌కు ఇంగిత జ్ఞానం ఉందా: షర్మిల

పెద్దపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.... కేసీఆర్‌కు ఇంగిత జ్ఞానం ఉందా అంటూ వ్యాఖ్యలు చేశారు. వర్షాల వల్ల ఇంత నష్టం జరిగితే.. పెద్ద నష్టం జరగలేదని అంటారా అని మండిపడ్డారు. కాళేశ్వరంలో మునిగిన పంప్ హౌస్‌లను ఎందుకు చూడనివ్వడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టును డిజైన్ చేసిన కేసీఆర్ అనే ఇంజనీర్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. మీడియాను, ప్రతిపక్ష నేతలని అడ్డుకోవడమేనా తమచిత్త శుద్ధి అని అన్నారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు ఎందుకు పర్యటించడం లేదని అన్నారు. వరద నష్టం పరిహారాన్ని టీఆర్‌ఎస్ పార్టీ అకౌంట్ నుంచే ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-22T19:52:41+05:30 IST