అయ్యా కేసీఆర్ గారు... మోదీని తరుముడు ఏమో గానీ...: Sharmila

ABN , First Publish Date - 2022-02-12T17:42:59+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అయ్యా కేసీఆర్ గారు... మోదీని తరుముడు ఏమో గానీ...: Sharmila

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ కోటలు బద్దలు కొట్టుడు కాదు.. ముందు రాష్ట్రంలో ఆగమైతున్న రైతులను నిలబెట్టాలని హితవుపలికారు. రోజుకిద్దరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘మోదీని దేశం నుంచి తరుముడు ఏమో గానీ... నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరమకుండా చూస్కో. మీరు పులి బిడ్డయితే... మొన్న మీ మెడ మీద లేని కత్తిని చూసి... వడ్లు కొననని ఎట్లా రాసిచ్చారు దొరగారు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటిదాకా కేంద్రానికి వంతపాడి, ఈరోజు ఉడుతఊపుల పంచాయితీ పెట్టారని  వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని సమస్యలనే పరిష్కరించడం చేతకాని మీరు దేశ రాజకీయాలు చేస్తారా? అని యెద్దేవా చేశారు. ‘‘గాలిలో మేడలు...పగటి కలలు...ఓట్ల కోసం తిప్పలు’’ అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2022-02-12T17:42:59+05:30 IST