రైతులు చస్తా ఉంటే సంబరాలు చేసుకుంటారా?: Sharmila

ABN , First Publish Date - 2022-01-13T19:26:07+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్సీపీ అధినేత్రి షర్మిల ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులు చస్తా ఉంటే సంబరాలు చేసుకుంటారా?: Sharmila

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయింది. చివరి గింజ వరకు కొంటానన్నది ఊసే లేకుండా పోయింది. పెట్టుబడి రాక రైతులు చస్తా ఉంటే మీరు సంబరాలు చేసుకొంటున్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయి అని రైతుల మీద ప్రేమ పొంగుకొచ్చినందుకు చాలా సంతోషం దొరగారు. కానీ కేంద్రం మెడలు వంచుతామంటేనమ్మాలా?.. మొన్నటి వరకు మీ మెడ మీద కత్తి పెట్టి వడ్లు కొనబోమని రాయించుకొన్నారు అన్న వాళ్ళ మెడలు ఈ రోజు మీరు వంచుతారా?.. ఎందుకు మీ రాజకీయ డ్రామాలు?.. మీ అధికారం కోసం, మీ కుర్చీ కోసం మీరు ఆడుతున్న నాటకాలలో ఇదే ఒక భాగమే... మీకు రైతుల మీద ప్రేమ లేదు. రైతుల చావుల మీద సోయి లేదు’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

Updated Date - 2022-01-13T19:26:07+05:30 IST