‘రైతుల ఇండ్లు బంగారు వాసాలు చేస్తానన్న దొర కేసీఆర్’
ABN , First Publish Date - 2021-11-23T18:01:33+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల ఇండ్లు బంగారు వాసాలు చేస్తానన్న దొర కేసీఆర్ అని అన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల ఇండ్లు బంగారు వాసాలు చేస్తానన్న దొర కేసీఆర్ అని అన్నారు. రైతులు అదే వాసాలకు ఉరివేసుకొంటుంటే ఆదుకోవడం చేతకావడం లేదని మండిపడ్డారు. రాజకీయ డ్రామాల కోసం దొరగారికి ఉత్తరాది రైతులకు డబ్బులు ఇవ్వడానికి చేతనౌతుంది...కానీ ఇక్కడి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. నోటిఫికేషన్స్ ఇవ్వడం చేతకాని దొరకు.. తన కుటుంబానికి పదవులు ఇచ్చుకోవడానికి చేతనౌతుందని వ్యాఖ్యానించారు. రైతులు చస్తుంటే ఆదుకోవడం చేతకాని తమరు రైతు నేస్తం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల త్యాగాల మీద పదవులను అనుభవిస్తున్నారన్నారు. వారిని ఆత్మహత్యల బాట పట్టిస్తున్నందుకు ‘‘మీ గుండెలు రాతి బండలు అయ్యుండాలి’’ అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు.