ప్రజల ప్రాణాలను సీఎం కేసీఆర్ గాలికొదిలేశారు: Sharmila
ABN , First Publish Date - 2021-10-10T17:28:16+05:30 IST
తెలంగాణ లో 108 వాహనాలపై సర్కార్ పర్యవేక్షణ లేదని వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ లో 108 వాహనాలపై సర్కార్ పర్యవేక్షణ లేదని వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల అన్నారు. ప్రజల ప్రాణాలను సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని విమర్శించారు. 420 వాహనాలు ఉంటే తిరిగేవి 100 మాత్రమే అని అన్నారు. వాహనాలకు డ్రైవర్లు లేరని..ఉన్నా జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు. 108 వాహనాలు ప్రజల వద్దకు చేరాలంటే సరైన రోడ్లు లేవన్నారు. వైద్యం అందక ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చాయని షర్మిల వ్యాఖ్యానించారు.