కేటీఆర్ మీద కేసు పెట్టాల్సిందే: షర్మిల
ABN , First Publish Date - 2022-01-02T01:03:44+05:30 IST
కరోనా నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి కేటీఆర్ మీద కేసు
హైదరాబాద్: కరోనా నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి కేటీఆర్ మీద కేసు పెట్టాల్సిందేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. నగరంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. రైతుల మంచికోసం తాము చేసే పనులు పాప కార్యాలు, మీరు అధికారం కోసం మీరు పెట్టే సమావేశాలు పుణ్యకార్యాలా అని నిలదీశారు. ప్రతిపక్షాలకు ఉన్న రూల్స్ ..పాలకపక్షానికి ఉండవా అని ఆమె ప్రశ్నించారు. కొవిడ్ సూచనలను పాటించకుండా నల్గొండ జిల్లాలో ర్యాలీలు తీసిన కేటీఆర్ మీద కేసెందుకు పెట్టరన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం బ్రతికుందని నిరూపించాల్సిందేనన్నారు. తాము చేపట్టిన రైతు ఆవేదన యాత్రను అడ్డుకోవడానికి గుర్తొచ్చే కరోనా నిబంధనలు..కేటీఆర్ సభలకు అడ్డురావా అని ఆమె ప్రశ్నించారు.