తెలుగు ప్రజలకు రాఖీ పండగ శుభాకాంక్షలు: షర్మిల
ABN , First Publish Date - 2021-08-22T13:45:45+05:30 IST
తెలుగు ప్రజలకు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్: తెలుగు ప్రజలకు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నా తోడబుట్టిన జగనన్నకు, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడు సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.