తొలి కమిటీలను ప్రకటించిన షర్మిల.. అసంతృప్తిలో కార్యకర్తలు

ABN , First Publish Date - 2021-07-30T22:34:43+05:30 IST

వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీ తొలి కమిటీలను ప్రకటించారు.

తొలి కమిటీలను ప్రకటించిన షర్మిల.. అసంతృప్తిలో కార్యకర్తలు

హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీ తొలి కమిటీలను ప్రకటించారు. 17 పార్లమెంట్ నియోజక వర్గాలకు ఒక కన్వీనర్, ముగ్గురు కో కన్వీనర్లను నియమించారు. 108 మంది సభ్యులను సయితం నియిమించారు. పాదయాత్ర చేపట్టేలోపు నియోజకవర్గాల వారిగా మిగిలిన కమిటీలను ఫైనల్ చేస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. మరోవైపు పార్టీ పదవుల పంపకాల్లో అసంతృప్తులు ఆందోళనకు దిగారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి మొదటి నుంచి పనిచేస్తున్న తనను కాకుండా వేరే వారికి పదవులు ఇచ్చారంటూ నర్శింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోటస్ పాండ్ వద్ద ఆయన ఆందోళనకు దిగారు. పదవులను కొందరు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.

Updated Date - 2021-07-30T22:34:43+05:30 IST