తెలంగాణ కేవలం మద్యం విషయంలోనే అభివృద్ధి చెందింది: షర్మిల

ABN , First Publish Date - 2022-06-24T01:07:22+05:30 IST

తెలంగాణ రాష్ట్రం కేవలం మద్యం విషయంలో మాత్రమే అభివృద్ధి చెందింది వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల విమర్శించారు.

తెలంగాణ కేవలం మద్యం విషయంలోనే అభివృద్ధి చెందింది: షర్మిల

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రం కేవలం మద్యం విషయంలో మాత్రమే అభివృద్ధి చెందింది వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల విమర్శించారు. ఖజానా నింపుకునేందుకు మద్యాన్ని ఏరులా పారిస్తున్నారని,ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. గురువారం సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం బరాఖత్‌గూడెం గ్రామస్తులతో వైఎస్ షర్మిల పాదయాత్రలో భాగంగా మాట-ముచ్చట నిర్వహించారు. ఈసందర్భంగా నాలుగేళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నట్లు వృద్దులు వివరించారు.


బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే అయ్యిందని షర్మిలా ఆరోపించారు. ఇది దొంగల రాజ్యం.. దోపిడీ దారుల రాజ్యమని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు.

Updated Date - 2022-06-24T01:07:22+05:30 IST