నల్లారి కిశోర్‌కు YSRCP యువనేత స్ట్రాంగ్ వార్నింగ్..!

ABN , First Publish Date - 2021-07-25T12:14:47+05:30 IST

టీడీపీ నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి మరోసారి అసభ్యంగా మాట్లాడితే ..

నల్లారి కిశోర్‌కు YSRCP యువనేత స్ట్రాంగ్ వార్నింగ్..!

చిత్తూరు/పీలేరు : రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గురించి టీడీపీ నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి మరోసారి అసభ్యంగా మాట్లాడితే ఊరుకోబోమని వైసీపీ పీలేరు నియోజకవర్గ యువనేత సి. హరీష్‌రెడ్డి హెచ్చరించారు. పీలేరు మార్కెట్‌ యార్డులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  తాను చెబితేనే ఆక్రమణలు తెలిశాయా అని కిశోర్‌కుమార్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారని వాస్తవానికి ఆయన మాట్లాడక ముందే ఎంపీ, ఎమ్మెల్యేలు విచారణకు ఉన్నతాధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.


టీడీపీ పాలనలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కిశోర్‌కుమార్‌రెడ్డి మండలానికి ఎన్ని ఇళ్లు మంజూరు చేశారో చెప్పాలన్నారు. వైసీపీ రెండేళ్ల పాలనలోనే 6500 ఇళ్లు మంజూరు చేయగా వివిధ దశల్లో నిర్మాణాలు ఉన్నాయని, 10వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు అంచెలంచెలుగా మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కడప గిరిధర్‌రెడ్డి, పీలేరు సర్పంచు డాక్టర్‌ ఎస్‌.హబీబ్‌బాషా, నాయకులు కంభం సతీష్‌రెడ్డి, ఏటీ రత్నశేఖర్‌రెడ్డి, దండు జగన్మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచు హుమయూన్‌, నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌, ఆనంద్‌, కంభం నరసింహారెడ్డి, జిలానీసాహెబ్‌, సుంకర చక్రధర్‌, షాకీర్‌, మునీర్‌, నరేష్‌, కాలనీచిన్న, ఎస్‌ఎల్వీ సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T12:14:47+05:30 IST