టీడీపీని ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

ABN , First Publish Date - 2021-10-26T00:57:19+05:30 IST

రాష్ట్రంలోని అన్ని ఎన్నికల్లో టీడీపీని ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారని వైఎస్సార్సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ

టీడీపీని ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

ఢిల్లీ: రాష్ట్రంలోని అన్ని ఎన్నికల్లో టీడీపీని ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారని వైఎస్సార్సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడులు ఎందుకు జ‌రిగాయో రాష్ట్ర‌ప‌తికి చంద్ర‌బాబు వివ‌రిస్తే మంచిదన్నారు. కుట్ర‌లో భాగంగానే రాష్ట్రంపై పెద్దఎత్తున త‌ప్పుడు ప్ర‌చారానికి దిగారని ఆయన ఆరోపించారు. జ‌నాక‌ర్ష‌క సీఎంపై దుర్భాష‌లాడి ప్ర‌జ‌లు రెచ్చిపోయేలా చేసి, రాష్ట్రంలో అల‌జ‌డి సృష్టించాల‌న్న‌దే టీడీపీ ప్ర‌య‌త్నమన్నారు.


2019 నుంచి వ‌రుస‌గా పార్ల‌మెంట్‌, అసెంబ్లీ, మున్సిప‌ల్‌, పంచాయితీ ఎన్నిక‌ల్లో టీడీపీని ప్ర‌జ‌లు పూర్తిగా తిర‌స్క‌రించారన్నారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ద‌తిలో అధికారం అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారని ఆయన ఆరోపించారు. దాంతో అప్ర‌జాస్వామికంగా, అక్ర‌మంగా ఆర్టిక‌ల్ 356 ఉప‌యోగించాల‌ని డిమాండ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎంపై బోసిడికె అని టీడీపీ నేత బూతులు మాట్లాడారన్నారు. అనేక మంది టీడీపీ నేత‌లు ఏ మాత్రం సంకోచించ‌కుండా త‌ప్పుడు మాట‌లు మాట్లాడుతున్నారని విజ‌య‌సాయిరెడ్డి విమర్శించారు. 

Updated Date - 2021-10-26T00:57:19+05:30 IST