వైఎస్ కాపు అయితే.. జగన్ ‘రెడ్డి’ ఎలా అయ్యాడు?: రఘురామ

ABN , First Publish Date - 2021-05-12T19:50:31+05:30 IST

వైసీపీ నేతలపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై సోషల్ మీడియా ద్వారా దాడి చేయిస్తున్నారన్న ఆయన..

వైఎస్ కాపు అయితే.. జగన్ ‘రెడ్డి’ ఎలా అయ్యాడు?: రఘురామ

న్యూఢిల్లీ: వైసీపీ నేతలపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై సోషల్ మీడియా ద్వారా దాడి చేయిస్తున్నారన్న ఆయన.. తనను విమర్శిస్తున్నవారికి కౌంటర్ ఇవ్వకుండా ఎలా ఉంటానని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజ్‌ అన్నట్టు గిల్లితే గిల్లుంచుకోవాలా? వాయిస్ వినిపించకూడదా? ఆపండ్రా... ఈ ఎదవ చెత్త’’ అని మండిపడ్డారు. రెడ్డి క్యాస్ట్‌ను మరోసారి ఎత్తి చూపిన ఆయన.. ‘‘మీకు మీరే అనేసుకుంటే సరిపోతుందా? నీ బాబు... నీ అమ్మ కులం సర్టిఫికేట్లలో కాపు అని ఉంటే... రెడ్డి ఎలా అవుతారు? ఇప్పుడు సర్టిఫికేట్లు మార్చుకుని రెడ్లు.. రెడ్లు అనుకుంటే నీ తండ్రి కులం, తల్లి కులం కానిది నీకెలా వచ్చిందిరా రెడ్డి?  వైఎస్ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో కాపు ఉంటే... జగన్ ‘రెడ్డి’ ఎలా అవుతాడురా.. కాపే అవుతాడు’’ అన్నారు. 



Updated Date - 2021-05-12T19:50:31+05:30 IST