వైసీపీ ఎంపీని నిలదీసిన ఎమ్మెల్యే విడదల రజనీ వర్గం

ABN , First Publish Date - 2020-02-20T03:58:59+05:30 IST

ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును ఎమ్మెల్యే విడదల రజనీ వర్గం అడ్డుకుంది.

వైసీపీ ఎంపీని నిలదీసిన ఎమ్మెల్యే విడదల రజనీ వర్గం

గుంటూరు : జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును ఎమ్మెల్యే విడదల రజనీ వర్గం అడ్డుకుంది. పురుషోత్తమపట్నంలో శివరాత్రి ప్రభలను చూసేందుకు ఎంపీ రాగా.. రజనీకి సమాచారం లేకుండా ఎలా వస్తారని ఎమ్మెల్యే వర్గీయులు నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనతో చేసేదేమీ లేక ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వెనుదిరిగారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.






Updated Date - 2020-02-20T03:58:59+05:30 IST