తగ్గేది లేదు.. స్టీల్ ప్లాంట్‌పై మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

ABN , First Publish Date - 2021-07-26T18:32:16+05:30 IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. గతంలో టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు

తగ్గేది లేదు.. స్టీల్ ప్లాంట్‌పై మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. గతంలో టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్రం.. తాజాగా లోక్‌సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నకు సేమ్ ఆన్సర్ ఇచ్చింది. ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్ కిషన్‌రావ్ కరద్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో రెండో ఆలోచన లేదని భగవత్ కిషన్‌రావ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-26T18:32:16+05:30 IST