జగన్ వెంట్రుక కూడా కదపలేరు: వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-08-06T00:21:11+05:30 IST
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు రాజధాని రైతుల పోరాటాన్ని...
అల్లవరం: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు రాజధాని రైతుల పోరాటాన్ని అవహేళన చేయడమే కాకుండా న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జడ్జీలు, కేసులు, సీఎం జగన్ వెంట్రుక కూడా కదపలేరని పండుల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పండులకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. అప్పటి నుంచి సందర్భం దొరికినప్పుడల్లా జగన్పై పండుల వీరవిధేయతను చాటుకుంటున్నారు. అయితే.. స్వామి భక్తి తాపత్రయంతో ఇంత దిగజారి మాట్లాడటమేంటని ప్రతిపక్షాలు పండులపై మండిపడుతున్నాయి.
మూడు రాజధానుల బిల్లు అంశం హైకోర్టులో విచారణలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అధికార పార్టీ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేశాయి. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో.. పండుల ఏదో గొప్పగా మాట్లాడినట్టుగా ఆయన వెనకున్న అనుచరులు చప్పట్లు కొట్టడం కొసమెరుపు.