ఒంగోలు జడ్పీ ఆఫీస్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే బైఠాయింపు

ABN , First Publish Date - 2020-06-02T04:23:52+05:30 IST

ఒంగోలు జడ్పీ ఆఫీస్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి బైఠాయించడం చర్చనీయాంశంగా...

ఒంగోలు జడ్పీ ఆఫీస్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే బైఠాయింపు

ప్రకాశం: ఒంగోలు జడ్పీ ఆఫీస్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి బైఠాయించడం చర్చనీయాంశంగా మారింది. కందుకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పట్టించుకోవటం లేదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. 90 గ్రామాల ప్రజలు తాగునీరు లేక అల్లాడుతున్నారని ఆయన చెప్పారు. అధికారులు కరోనా కాన్ఫరెన్స్‌ల పేరిట కాలయాపన చేస్తున్నారని మహీధర్‌రెడ్డి విమర్శించారు. సీఎం ఆశయాలను జిల్లా అధికారులు తుంగలో తొక్కుతున్నారని, అధికారంలో ఉండి కూడా నియోజకవర్గ సమస్యలు తీర్చలేకపోతున్నామని మహీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

Updated Date - 2020-06-02T04:23:52+05:30 IST