Nellore లో అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తల హల్చల్
ABN , First Publish Date - 2021-08-25T13:35:21+05:30 IST
నెల్లూరు : జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు రోడ్డులో అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు.
నెల్లూరు : జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు రోడ్డులో అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. కంటైనర్లు, ట్రాలీ లారీలు నిలిపివేసి అందరూ తమ యూనియన్లో చేరాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి పేరిట బెదిరింపులకు దిగారు. యూనియన్లో చేరకపోతే మున్ముందు ఇబ్బందులు తప్పవన్నట్లుగా డ్రైవర్లను బెదిరించినట్లు తెలుస్తోంది.
ఈ కార్యకర్తల పనితో సుమారు 5 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. డ్రైవర్లు, క్లీనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా పోలీసులు ఘటనాస్థలికి ఎందుకు రాలేదు..? ఎందుకు వైసీపీ కార్యకర్తలను అడ్డుకోలేదు..? అనేది ప్రశ్నార్థకం. మరోవైపు తన గురించి వార్తలు వస్తే చాలు.. వెంటనే రియాక్ట్ అయ్యే కాకాణి మాత్రం ఇంతవరకూ ఈ విషయంపైనా స్పందించనే లేదు.