AP News: రేపటి నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా - వైబ్సైట్ను ప్రారంభించిన సీఎం జగన్
ABN , First Publish Date - 2022-10-01T00:17:58+05:30 IST
Amaravathi: ఏపీ ప్రభుత్వం మరో రెండు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. ఆడపిల్లలకు పెళ్లి కానుకగా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను అక్టోబర్ 1న లాంఛనంగా ప్రారంభించ నున్నారు. ఈ పథకాల అమ
Amaravathi: ఏపీ ప్రభుత్వం మరో రెండు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. ఆడపిల్లలకు పెళ్లి కానుకగా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను అక్టోబర్ 1న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకాల అమలుకు సంబంధించిన వైబ్ సైట్ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం మాత్రమే కాకుండా, పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్ను తగ్గించడమే లక్ష్యంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు.