4.40 లక్షల మందికి వైఎస్‌ఆర్‌ బీమా

ABN , First Publish Date - 2021-05-18T04:51:52+05:30 IST

జిల్లాలో 4.40 లక్షల మందికి వైఎస్‌ఆర్‌ బీమా ప్రీయిమం చెల్లించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శాంతి శ్రీ పేర్కొ న్నారు.

4.40 లక్షల  మందికి వైఎస్‌ఆర్‌ బీమా
బ్యాంకు అధికారులతో సమీక్షిస్తున్న డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ


డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ 
నరసన్నపేట, మే 17: జిల్లాలో 4.40 లక్షల మందికి వైఎస్‌ఆర్‌ బీమా ప్రీయిమం చెల్లించనున్నట్లు  డీఆర్‌డీఏ పీడీ శాంతి శ్రీ పేర్కొ న్నారు. సోమవారం స్థానిక ఆంధ్రాబ్యాంకులో వైఎస్‌ఆర్‌ బీమా లింకేజ్‌ను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది వరకు సు మారు 4లక్షలు మంది వరకు బీమా సదుపాయం కల్పించగా ఈఏడాది మరో 40 వేల మందికి బీమా ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్ణయించా మన్నా రు. జీవనజ్యోతి బీమా పథకం కింద రూ.330, సురక్ష బీమా కింద రూ. 12లు లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఈనెల 31 నాటికి ఈ ప్రకియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ బీమా పథకం డీపీఎం ఆర్వీ రమణ, ఏపీఎం హేమసుందర్‌, బ్యాంకు మేనేజర్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T04:51:52+05:30 IST