స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి బుద్ది చెప్పాలి: జేసీ పవన్

ABN , First Publish Date - 2020-02-19T23:22:08+05:30 IST

అనంతపురం: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలని..

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి బుద్ది చెప్పాలి: జేసీ పవన్

అనంతపురం: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలని అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్చార్జ్ జేసీ పవన్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చారు. బుధవారం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో యువత తీవ్రంగా నష్టపోతోందన్నారు.  జగన్ సీఎం అయ్యాక ఒక రూపాయి పెట్టుబడి కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. ప్రభుత్వం కేసులు పెడితే ఎవరూ భయపడవద్దన్నారు. 9నెలల వైసీపీ పాలనలో ప్రజలు విసిగెత్తిపోయారని పవన్ కుమార్ రెడ్డి అన్నారు.

Updated Date - 2020-02-19T23:22:08+05:30 IST