వైసీపీది చేతగాని పాలన..!

ABN , First Publish Date - 2022-08-18T03:44:20+05:30 IST

వైసీపీ చేతగాని పాలనతో ప్రజలు కష్టాలపాలవుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరి క్షన్‌బాబు అన్నారు.

వైసీపీది చేతగాని పాలన..!
గ్రామంలో పర్యటిస్తున్న ఎరిక్షన్‌బాబు

ధరల పెరుగుదలతో  

పేదల బతుకులు భారం

మళ్లీ కరెంట్‌ చార్జీల బాదుడు

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

త్రిపురాంతకం, ఆగస్టు 17: వైసీపీ చేతగాని పాలనతో ప్రజలు కష్టాలపాలవుతున్నారని  టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరి క్షన్‌బాబు అన్నారు. మండలంలోని గొల్లపల్లి గ్రామంలో బుధవారం బాదుడే బాదుడు కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సం ద ర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ  వైసీపీ అధికారంలోకి వచ్చాక నిత్యావసరాల ధరలు, పెట్రోల్‌, గ్యాస్‌, బస్సు చార్జీలు సా మాన్య ప్ర జలకు అందుబాటులో లేవన్నారు. వచ్చే నెల నుంచి మరోసారి ట్రు అప్‌ చార్జీల పేరుతో క రెంట్‌ చార్జీల బాదుడు మొదల వుతుం దని తెలిపారు. గ్రామాల్లో అభి వృద్ధి శూన్య మన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి దారు ణమన్నారు. ప్రాణాలు తీస్తున్న రోడ్ల మరమ్మ తులు చివరకు ప్రజలే చేసుకునే దుస్థితికి నెల కొనడం చూస్తుంటే వైసీపీ చేత గాని పాలన అర్థమవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అ న్ని రకాలుగా అవకాశాలు కల్పించి, అభివృద్ధి చేసింది టీడీపీ మాత్రమేనని ఎరిక్షన్‌ బాబు గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి చం ద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అటు రాష్ట్రం, ఇటు గ్రామాల అభివృద్ధితోపాటు ప్రజలు సు ఖంగా ఉంటారన్నారు. ముందుగా ఆయన గ్రా మంలో ఇంటింటికీ తిరిగి వైసీపీ అధోగతి పాలన, ధరల పెరుగుదలను ప్రజలకు తెలి పారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ మేకల వలరాజు, మాజీ కన్వీనర్‌ మోటకట్ల శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాసరరెడ్డి, దేవినేని చలమయ్య, వంకాయలపాటి ఆం జనేయులు, కటికి ఏడుకొండలు, చేకూరి సుబ్బ య్య, కామేపల్లి వెంకటేశ్వర్లు, మాబు, ఎస్సీ సెల్‌ మండ లాధ్యక్షుడు అధ్యక్షుడు వర్ధన్‌బాబు, గాంధీ, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-18T03:44:20+05:30 IST