వైసీపీ నేతల ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2020-02-24T09:35:14+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ నేతల్లో ఆధిపత్య పోరు మొదలైంది. కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లెలో వైసీపీలోని రెండు వర్గాలు ఆదివారం ఘర్షణకు దిగాయి. ఒక వర్గానికి చెందిన

వైసీపీ నేతల ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

అవుకు, ఫిబ్రవరి 23: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ నేతల్లో ఆధిపత్య పోరు మొదలైంది. కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లెలో వైసీపీలోని రెండు వర్గాలు ఆదివారం ఘర్షణకు దిగాయి. ఒక వర్గానికి చెందిన వెంకటశివారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, మరో వర్గానికి చెందిన శివనాథరెడ్డి గాయపడ్డారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆధిపత్యం కోసం ఈ రెండు వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. బనగానపల్లె పోలీసులు ఇరువర్గాలకు చెందిన 9 మందిపై కేసు నమోదు చేసి, పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-02-24T09:35:14+05:30 IST