వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ

ABN , First Publish Date - 2020-09-21T16:39:41+05:30 IST

దివంగత నేత, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. అప్పట్లో వివేకానంద రెడ్డితో సన్నిహితంగా ఉన్న మహిళతో పాటు మరో మహిళను రెండవ రోజు సీబీఐ అధికారులు

వివేకా హత్య  కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ

కడప : దివంగత నేత, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. అప్పట్లో వివేకానంద రెడ్డితో సన్నిహితంగా ఉన్న మహిళతో పాటు మరో మహిళను రెండవ రోజు సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అలాగే ఎంపీ అవినాష్‌ రెడ్డి సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులను, కర్నూలుకు చెందిన డాక్టర్ చిన్నను అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ మొత్తం ఐదుగురిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకాతో వారికి ఉన్న సంబంధాలు, ఇతర అంశాలపై ఆరా తీస్తున్నారు. కాగా, సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైఎస్ వివేకా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించింది. దీంతో సీబీఐ అధికారులు వివేకా హత్య కేసును తేల్చే పనిలో పడ్డారు.

Updated Date - 2020-09-21T16:39:41+05:30 IST