వివేకా హత్య కేసులో 95వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ
ABN , First Publish Date - 2021-09-09T16:58:04+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 95వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 95వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది. ఈరోజు పులివెందులకు చెందిన ఉమా శంకర్ రెడ్డి, భారత్ కుమార్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. వీరిని ఇప్పటికే అనేక సార్లు సీబీఐ అధికారులు విచారించారు. మరికొంతమంది అనుమానితులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.