ఎంతమంది బాధలు విన్నామన్నదే ముఖ్యం: వైఎస్ విజయమ్మ

ABN , First Publish Date - 2022-03-12T02:01:36+05:30 IST

పాదయాత్ర అంటే ఎన్ని కిలోమీటర్లు నడిచారన్నది కాదని, పరుగుపందెం

ఎంతమంది బాధలు విన్నామన్నదే ముఖ్యం: వైఎస్ విజయమ్మ

నల్లగొండ: పాదయాత్ర అంటే ఎన్ని కిలోమీటర్లు నడిచారన్నది కాదని, పరుగుపందెం అంతకంటే కాదని, ఎంత మందిని కలిసి వారి బాధలు విన్నామన్నదే ముఖ్యమని వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రారంభించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా జిల్లాలోని నార్కట్‌పల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకొని పాలించారని ఆమె పేర్కొన్నారు. జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు కట్టి ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారని ఆమె అన్నారు. 

Updated Date - 2022-03-12T02:01:36+05:30 IST