Kadapa : సుబ్బరాయుడిపై వైఎస్ వివేకా కుమార్తె ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-07-13T13:15:56+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Kadapa : సుబ్బరాయుడిపై వైఎస్ వివేకా కుమార్తె ఫిర్యాదు

కడప : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అసలు ఈ ఘటన ఎలా జరిగింది..? ఎవరు చేశారనే విషయం నాటి నుంచి నేటికీ తేలలేదు. కేసు వీలైనంత త్వరగా తేల్చేయాలని సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో వివేకా కుమార్తె సునీత.. సుబ్బరాయుడు అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈయన కడప నగరానికి చెందిన వ్యక్తి.


ఫిర్యాదు ఎందుకంటే..

కాగా.. వివేకా హత్యకు సంబందించిన సాక్ష్యాల వివరాలు కావాలని సుబ్బరాయుడు సెంట్రల్ గ్రీవెన్ సెల్‌ను కోరాడు. అలాగే వివేకా కుమార్తె సునీతను కూడా అదుపులోకి తీసుకొని విచారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశాడు. ఈ విషయం సునీత సెల్‌కు మెయిల్ వెళ్లడంతో సుబ్బరాయుడుపై కేసు నమోదుచేసి చర్యలు చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో పులివెందుల డీఎస్పీకి సునీత ఫిర్యాదు ఇచ్చారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ఇదిలా ఉంటే.. గత 20 రోజులుకు పైగా కడపలో సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను విచారిస్తూనే ఉన్నారు. ఇప్పటికే వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరితో పాటు ఆయన ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే ఇదయతుల్లాను ఇలా చాలా మందినే అధికారులు విచారించారు.

Updated Date - 2021-07-13T13:15:56+05:30 IST