నాడు YS విగ్రహం పెట్టి.. మందిరం కట్టాడు.. నేడు ధ్వంసం చేశాడు..

ABN , First Publish Date - 2022-06-24T16:24:03+05:30 IST

గుంటూరు నగరంలో వైసీపీ నేత వలి వీరారెడ్డి అనే వ్యక్తి కొంత కాలం క్రితం తన ఇంటి ఆవరణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి..

నాడు YS విగ్రహం పెట్టి.. మందిరం కట్టాడు.. నేడు ధ్వంసం చేశాడు..

గుంటూరు : గుంటూరు నగరంలో వైసీపీ నేత వలి వీరారెడ్డి అనే వ్యక్తి కొంత కాలం క్రితం తన ఇంటి ఆవరణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. దానికి మందిరాన్ని కట్టి.. లైటింగ్ కూడా పెట్టించి తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. తాజాగా తన ఇంట్లో ఉన్న వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వీరారెడ్డి భార్య ప్రస్తుతం 44వ వార్డు కార్పొరేటర్‌గా ఉంది. తమకు పార్టీలో గౌరవం, గుర్తింపు లేదని కొద్ది రోజులుగా వీరారెడ్డి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పార్టీ కీలక నేత తీరుతో విసిగి వేసారి పోయారు. ఈ క్రమంలోనే నిన్న వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసి తమ అసహనాన్ని చాటుకున్నారు. 

Updated Date - 2022-06-24T16:24:03+05:30 IST