నేడు రంగారెడ్డిలో వైఎస్ షర్మిల పర్యటన
ABN , First Publish Date - 2021-06-11T14:30:24+05:30 IST
వైఎస్ షర్మిల ఈరోజు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు.
హైదరాబాద్: వైఎస్ షర్మిల ఈరోజు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పరిగి నియోజక వర్గం దోమ మండలంలో ఐకేపీ సెంటర్ను షర్మిల పరిశీలించనున్నారు. ఈ మధ్యనే ధాన్యం కొనడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపై ధాన్యాన్ని తగ్గులబెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులతో షర్మిల ముఖాముఖి నిర్వహించనున్నారు.