నిరంజన్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు పిలుపు
ABN , First Publish Date - 2021-10-28T20:25:55+05:30 IST
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమతి వైఎస్ షర్మిలపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది.
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమతి వైఎస్ షర్మిలపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. కావున పార్టీ కన్వీనర్లు, కో -కన్వీనర్లు, దళిత, మైనార్టీ, యువజన విభాగాల నాయకులు మీ మీ పరిధిలో మంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంతో పాటు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని సూచించింది.