68వ రోజుకు చేరుకున్న షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

ABN , First Publish Date - 2022-04-27T12:32:18+05:30 IST

వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర 68వ రోజుకు చేరుకుంది. నేడు పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం

68వ రోజుకు చేరుకున్న షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

భద్రాద్రి కొత్తగూడెం: వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర 68వ రోజుకు చేరుకుంది. నేడు పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం సంజీవరెడ్డి పాలెం క్యాంప్ నుంచి ఉదయం 10 గంటలకు పాదయాత్ర మొదలుపెట్టనుంది. బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర గ్రామంలో ఉదయం 11 గంటలకు రైతు గోస ధర్నాలో షర్మిల పాల్గొననుంది. అనంతరం జింకలగూడెం, ఆజంపురం, పినపాక పట్టినగర్ మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు పాల్వంచలో ప్రజలతో మాట-ముచ్చట కార్యక్రమంలో షర్మిల పాల్గొననుంది.

Updated Date - 2022-04-27T12:32:18+05:30 IST